Home / Latest News / తెలంగాణా BJP ని నిట్టనిలువున చీల్చిన చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు!
dattatreya

తెలంగాణా BJP ని నిట్టనిలువున చీల్చిన చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు!

తెలంగాణా BJP ని నిట్టనిలువున చీల్చిన చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు! చంద్రబాబుకు, వెంకయ్య నాయుడుకి మద్దత్తుగా బందరు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు. సికింద్రాబాద్ లోక్ సభ కి పోటి చేస్తున్న దత్తాత్రేయ తన ప్రచార రథం పై చంద్రబాబు ఫోటో, పేరు పెట్టుకొని, పొత్తుని వ్యతిరేకించిన కిషన్ రెడ్డి ఫోటో పెట్టలేదు.

సికింద్రాబాద్ స్థానాన్ని ఆశించిన కిషన్ రెడ్డి దాని కొరకి చివరి వరికి వేచి చూసినా, వెంకయ్య మద్దతుతో ఆ లోక్ సభ స్థానాన్ని దత్తాత్రేయ దక్కించుకున్నాడు. అంబర్ పెట్ శాసన సభ పోటి పై ఆసక్తి లేదని కూడా కిషన్ బహిరంగంగ ప్రకటించాడు. మోడీ సర్కార్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉండే సమయంలో సికింద్రాబాద్ నుంచి గెలిస్తే యువకుడైన కిషన్ రెడ్డికి కేంద్ర కాబినెట్లో బెర్త్ కచ్చితంగా దొరికేది. తెలంగాణా రాష్ట్రంలో ప్రబల శక్తిగ ఎదిగే అవకాశం ఉండేది. ఆ అవకాశం 66 సంవత్సరాల దత్తాత్రేయ కొట్టేసాడు. తెలంగాణాలో పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేసిన కిషన్ రెడ్డికి ఇది చేదు అనుభవం. పార్టీకి గత కొన్ని ఏళ్ళలో దత్తాత్రేయ చేసింది ఏమి లేదు కూడా అని BJP కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా కిషన్ రెడ్డిని పక్కకు పెట్టడంతో ప్రచాన్న యుద్ధం కాస్త బహిరంగ యుద్ధం అయ్యింది. అంబర్ పేటలో కిషన్ రెడ్డి ని గెలవనిచ్చే ప్రసక్తే లేదని పొత్తు పెట్టుకున్న TDP నాయకులు హెచ్చరించడం దీనికి కొసమెరుపు!

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,283 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>