-గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ప్రణాళిక-అత్యాధునిక యంత్రంతో పూడ్చివేత పనులు-ఆగస్టు 15 నుంచి -3నెలలు పైలెట్ ప్రాజెక్టు-ఆ తర్వాత గుంతలు -గుర్తిస్తే మనీ ప్రైజ్-జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్ రోడ్డుపై గుంతను గుర్తించండి.. వెయ్యి రూపాయలు బహుమానంగా ఇస్తాం.. ఈ మాటలన్నది ఎవరో కాదు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్.. నగరంలోని ప్రధాన రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా గుంతలు పూడ్చే అత్యాధునిక యంత్రాన్ని ఉపయోగించబోతున్నారు. గుంతల డేటాబేస్ను రూపొందించేందుకు మైక్రోసాఫ్ట్ సేవలను వినియోగించనున్నారు. సెంట్రల్జోన్ పరిధిలో ముందుగా కొన్ని రోడ్లను ఎంపిక చేసి ఆగస్టు 15న పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.గుంతలు గుర్తించిన అనంతరం ఇన్ఫ్రారిడ్ హీటింగ్ సిస్టంతో కూడిన యంత్రం సహాయంతో వాటిని అక్కడికక్కడే పూడ్చివేస్తారు. బీటీని నిర్ణీత ఉష్ణోగ్రతలో వేడిచేసి కంకరలో కలుపుకుని గుంతలను పూడ్చడం ఈ యంత్రం ప్రత్యేకత. ప్రతి చదరపు మీటరుకు యంత్రానికి నిర్ణీత ధరను చెల్లిస్తారు. ఇదే విషయమై కమిషనర్ మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టు కింద మూడునెలల పాటు ప్రధాన రోడ్లపై అమలు చేస్తామని, ఆ తర్వాత గుంతలు గుర్తిస్తే రూ. 1000 బహుమానంగా ఇస్తామని తెలిపారు. సిటీబ్యూరో, టీ ...
Read More »