Home / తెలుగు / గుంత చూపిస్తే…1000 బహుమానం! – GHMC ప్రణాళిక

గుంత చూపిస్తే…1000 బహుమానం! – GHMC ప్రణాళిక

-గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ ప్రణాళిక
-అత్యాధునిక యంత్రంతో పూడ్చివేత పనులు
-ఆగస్టు 15 నుంచి 
-3నెలలు పైలెట్ ప్రాజెక్టు
-ఆ తర్వాత గుంతలు 
-గుర్తిస్తే మనీ ప్రైజ్
-జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ 

రోడ్డుపై గుంతను గుర్తించండి.. వెయ్యి రూపాయలు బహుమానంగా ఇస్తాం.. ఈ మాటలన్నది ఎవరో కాదు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్.. నగరంలోని ప్రధాన రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా గుంతలు పూడ్చే అత్యాధునిక యంత్రాన్ని ఉపయోగించబోతున్నారు. గుంతల డేటాబేస్‌ను రూపొందించేందుకు మైక్రోసాఫ్ట్ సేవలను వినియోగించనున్నారు. సెంట్రల్‌జోన్ పరిధిలో ముందుగా కొన్ని రోడ్లను ఎంపిక చేసి ఆగస్టు 15న పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

గుంతలు గుర్తించిన అనంతరం ఇన్ఫ్రారిడ్ హీటింగ్ సిస్టంతో కూడిన యంత్రం సహాయంతో వాటిని అక్కడికక్కడే పూడ్చివేస్తారు. బీటీని నిర్ణీత ఉష్ణోగ్రతలో వేడిచేసి కంకరలో కలుపుకుని గుంతలను పూడ్చడం ఈ యంత్రం ప్రత్యేకత. ప్రతి చదరపు మీటరుకు యంత్రానికి నిర్ణీత ధరను చెల్లిస్తారు. ఇదే విషయమై కమిషనర్ మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టు కింద మూడునెలల పాటు ప్రధాన రోడ్లపై అమలు చేస్తామని, ఆ తర్వాత గుంతలు గుర్తిస్తే రూ. 1000 బహుమానంగా ఇస్తామని తెలిపారు. సిటీబ్యూరో, టీ మీడియా : వచ్చే మూడు నెలల తరువాత రోడ్డుపై గుంతను గుర్తిస్తే రూ. 1000బహుమతి పొందే అవకాశం లభించనుంది. రోడ్లపై గుంతలు లేకుండా చేసేందుకు జీహెచ్‌ఎంసీ ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీనుంచి గుంతలు పూడ్చే అత్యాధునిక యంత్రాన్ని తెప్పిస్తున్నారు. అంతేకాదు, గుంతల డేటాబేస్‌ను రూపొందించేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ సేవలను వాడుకోవాలని నిశ్చయించారు. గురువారం ఈ యంత్రం నగరానికి రానుంది. సెంట్రల్‌జోన్ పరిధిలోని కొన్ని ఎంపిక చేసిన రోడ్లను ఆగస్టు 15నుంచి పైలెట్ ప్రాజెక్టుకింద అప్పగించాలని నిర్ణయించారు.

-ఇన్ఫ్రారిడ్ హీటింగ్ సిస్టంతో 
నగరంలో అన్ని రోడ్లూ కలిపి సుమారు ఏడువేల కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉండగా, అందులో దాదాపు 350 కిలోమీటర్లు ప్రధానరోడ్లున్నాయి. వాహనాల ట్రాఫిక్ ఎక్కువగా వీటిపైనే ఉంటుంది. అంతేకాదు, ఎక్కువగా పాడవుతూ వాహనదారులకు ఇబ్బందులు సృష్టిస్తున్నవి కూడా ఈ రోడ్లే. రోడ్లపై పడుతున్న గుంతలు తరచూ రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి. నగరంలోని ప్రధాన రోడ్లపై గుంతల సమస్యను పూర్తిగా లేకుండా చేసేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా ముందు మైక్రోసాఫ్ట్ సంస్థ సహకారంతో గుంతలకు చెందిన డేటాబేస్‌ను రూపొందిస్తారు.

ముందుగా ఏయే రోడ్లపై ఎక్కడ ఏ మేరకు గుంతలున్నాయో గుర్తిస్తారు. అనంతరం ఇన్ఫ్రారిడ్ హీటింగ్ సిస్టంతో కూడిన యంత్రం సహాయంతో వీటిని అక్కడికక్కడే పూడ్చివేస్తారు. బీటీని నిర్ణీత ఉష్ణోగ్రతలో వేడిచేసి అందులో కంకర కలుపుకొని గుంతలను పూడ్చివేయడం ఈ యంత్రం ప్రత్యేకత. గుంతలను పూడ్చి వేసేందుకు ఇప్పటికే ఢిల్లీలో ఈ యంత్రాన్ని వాడుతున్నారు. ఇటువంటి యంత్రాన్ని నగరానికి కూడా తెప్పిస్తున్నారు. గురువారం ఈ యంత్రం నగరానికి చేరుకోనుంది. ఆగస్టు 15నుంచి ఎంపిక చేసిన రోడ్లపై పైలెట్ ప్రాజెక్టు కింద పనులు చేపట్టాలని నిర్ణయించారు. సెంట్రల్‌జోన్‌లోని ఎంపిక చేసిన రోడ్లపై పైలెట్ ప్రాజక్టుకింద చేపట్టి అనంతరం నగరంలోని ప్రధాన రోడ్లకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ యంత్రానికి ప్రతి చదరపు మీటరుకు నిర్ధారిత ధరను చెల్లిస్తారు. ట్రాఫిక్ సమస్య అధికంగా ఉండే ప్రధాన రోడ్లపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

11,385 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>