-అన్-అలాటెడ్ విద్యుత్ కోటాలోనూ అన్యాయం
-ఆంధ్రాకు 177 మెగావాట్లు, తెలంగాణకు 100 మెగావాట్లు
-కోతలతో అల్లాడుతున్న మన రాష్ట్రంపై కరుణ చూపని వైనం
విద్యుత్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల కేంద్రం సవతితల్లి ప్రేమ చూపుతోంది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్పై ఎక్కడలేని ప్రేమ ప్రదర్శిస్తున్న కేంద్రం కోతలతో అల్లాడుతున్న తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతోంది. ఇప్పటికే ఏపీ సర్కార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ) రద్దు చేస్తామంటూ రాద్ధాంతం సష్టించినా అందుకు మోడీ సర్కార్ సానుకూలత వ్యక్తంచేసింది. తాజాగా సోమవారం జరిపిన అన్ అలాటెడ్ విద్యుత్ కోటాల్లోనూ తెలంగాణ పట్ల వివక్షను చాటుకుంది.
కేంద్ర ప్రభుత్వం పరిధిలోని సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల (సీజీఎస్) నుంచి ఎవ్వరికీ కేటాయించని (అన్-అలాటెడ్)విద్యుత్ కోటాలో ఆంధ్రప్రదేశ్కు ఏకంగా 177 మెగావాట్లు కేటాయించింది. అదేసమయంలో తగినంత విద్యుత్ లేక అవస్థ పడుతున్న తెలంగాణకు మాత్రం అన్-అలాటెడ్ కోటా నుంచి కేవలం 100 మెగావాట్లు మాత్రమే కేటాయించింది. రెండు రోజుల కిందట తెలంగాణకు కేటాయింపుల్లోంచి 65 మెగావాట్ల విద్యుత్తును ఆంధ్రప్రదేశ్కు మళ్ళించిన విషయం తెలిసిందే. విద్యుత్రంగంలో తెలంగాణ రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ దష్టికి తీసుకువస్తునే ఉంది. అయితే విద్యుత్ కోతలతో అతలాకుతలమవుతున్న తెలంగాణ పట్ల కేంద్రం ఏమాత్రం సానుకూల వైఖరి ప్రదర్శించకపోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లో చిన్న పొరపాటు జరిగిందనే నెపంతో 65 మెగావాట్ల విద్యుత్తును ఆంధ్రాకు మళ్ళించిన కేంద్రం ఆ మేరకు తెలంగాణకు సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో