కరీంనగర్ జనసంద్రమైంది. తమ ప్రియతమ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు రావడంతో వేల సంఖ్యలో వచ్చిన జనం.. ఆయనకు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు జిల్లా కేంద్రం శివారులోకి చేరుకోగానే ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్, జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఎమ్మెల్యేలు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. అప్పటికే అక్కడ బారులు తీరిన విద్యార్థినులు కాన్వాయ్పై పూల వర్షం కురిపించారు. అనంతరం ప్రత్యేక బుల్లెట్ప్రూఫ్ బస్సులో ఎక్కిన సీఎం, ప్రజలకు అభివాదం చేస్తూ ప్రదర్శనగా ముందుకు సాగారు. రాంపూర్, కమాన్, సిక్కువాడీ, కరీంనగర్ కార్పొరేషన్ కార్యాలయం, బస్స్టేషన్ మీదుగా కలెక్టరేట్ వరకు రెండుగంటల పాటు ర్యాలీ సాగింది. ముఖ్యమంత్రిని చూసేందుకు రహదారికిరువైపులా బారులు తీరిన నగరవాసులు.. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. వీరందరికీ అభివాదం చేస్తూ సీఎం ముందుకు కదిలారు. బతుకమ్మలు, బోనాలతోపాటు ఒగ్గుడోలు ప్రదర్శన, లంబాడీల నృత్యాలు ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు నగరంలోని కమాన్ వద్ద ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బోయినపల్లి వెంకటరామారావు (కరీంనగర్ ...
Read More »