-కట్టా శేఖర్ రెడ్డి సంకల్పం ఉంటే సప్త సముద్రాలను అలవోకగా దాటవచ్చు. నాయకుడు దీక్షాదక్షుడైతే జనాన్ని సైన్యంలా నడిపించవచ్చు. ఎటువంటి లక్ష్యాలనైనా సాధించవచ్చు. ఒకేరోజు రాష్ట్రంలోని 84 లక్షల ఇళ్లకు వెళ్లి సర్వే నిర్వహించాలన్న ఆలోచనే అసాధారణమైనది, విప్లవాత్మకమైనది. బడ్జెట్ రూపకల్పనకోసం, సంక్షేమ పథకాల అమలుకోసం, నిధుల కేటాయింపుకోసం ఇప్పటి వరకు జరుగుతున్న సర్వేలన్నీ శాంపిల్ సర్వేలు. ఉజ్జాయింపు సర్వేలు. జనాభా లెక్కల సేకరణ ఒక్కటే సమగ్ర సర్వే. కానీ అందులో ప్రభుత్వానికి అవసరమైన అనేక వివరాలు సేకరించడం లేదు. అందులో కూడా పౌరులు చెప్పింది రాసుకోవడమే. పరిశీలనాత్మక సర్వే లేదు. సరైన, సమగ్రమైన సమాచారం లేకుండానే కొన్ని దశాబ్దాలుగా మన ప్రభుత్వాలు రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఏటా లక్షలాది ఇళ్ల నిర్మాణం ప్రకటిస్తారు. ఏటా కొత్తగా వేలు లక్షలు రేషన్కార్డులు ఇస్తారు. ఏటా సామాజిక పెన్షన్ల సంఖ్య పెరుగుతూ పోతుంది. వీటికి అంతులేకుండా పోతున్నది. నిజమైన లబ్ధిదారులను గుర్తించడంలో తీవ్రమైన వైఫల్యం జరుగుతున్నది. అందుకే 84లక్షల గృహస్తులు ఉన్న మనరాష్ట్రంలో ఇప్పటికే 54 లక్షల ఇళ్లు నిర్మించినా ఇంకా ఇళ్ల నిర్మాణానికి లక్షలాది దరఖాస్తులు ఎదురు ...
Read More »