-ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సిద్ధమని సెయిల్ ప్రకటన.. -సరిపడా విద్యుత్, నీరు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ-శరవేగంగా నివేదికలు సిద్ధం చేస్తున్న అధికారులు.. -మరో పదిరోజుల్లో స్టీల్ ప్లాంట్పై స్పష్టత తెలంగాణ సిరుల గడ్డపై మరో మణిమాణిక్యం మొగ్గ తొడగనుంది. పరాయి పీడనలో అక్రమార్కుల చేతుల్లో లూటీకి గురైన బయ్యారం గనులపై.. ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. స్వీయ పాలనలో ఉక్కు కర్మాగారానికి చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్లాంట్ ఏర్పాటుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఆమోదం తెలిపింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. గత నెల 21, 22 తేదీల్లో ఖమ్మం జిల్లా పాల్వంచ, బయ్యారం, కొత్తగూడెం ప్రాంతాల్లో సెయిల్ బందం పర్యటించి అధ్యయనం చేసింది. కర్మాగార ఏర్పాటుకు వాతావరణ పరిస్థితులను అంచనా వేసింది.బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమని ప్రకటిస్తూ సెయిల్ సంస్థ తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖకు లేఖ పంపింది. కాగా, ప్లాంట్ ఏర్పాటుకు సెయిల్ బందం మూడు ప్రాంతాలను ఎంపిక చేసింది. అందులో పాల్వంచ మండలం వెలమనూరు, కొత్తగూడెం మండలం కూనారం, బయ్యారం మండల కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటును ...
Read More »