త్వరలో పోలీస్శాఖలో కొలువుల మేళాకు తెరలేవనుంది. ప్రపంచస్థాయి పోలీసింగ్పై దష్టిపెట్టిన పోలీస్శాఖ సిబ్బంది లోటును భర్తీ చేసుకోవాలని భావిస్తోంది. ఇందులోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆరువేలమంది కానిస్టేబుళ్లు, 500 మంది ఎస్సైల నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు డీజీపీ కార్యాలయం కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణలో పోలీసింగ్ను పటిష్టపరచడానికి తగినంతగా సిబ్బంది నియామకం అత్యవసరం. పైగా రాష్ట్ర రాజధానిలో ప్రపంచస్థాయి పోలీస్ వ్యవస్థ నెలకొల్పాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో సిబ్బంది కొరతను అధిగమించడానికి హోంగార్డు స్థాయి నుంచి ఎస్ఐ వరకు నియామకాలు జరుపాలని ప్రభుత్వం దఢనిశ్చయంతో ఉందని పోలీస్శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మొదటి దశలో భారీగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి నియామక ప్రక్రియ కావడంతో భారీస్థాయిలో ఖాళీలను భర్తీ చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. డీజీపీ ఈ మేరకు వివిధ విభాగాలు, జిల్లాల ఎస్పీల నుంచి ఖాళీలకు సంబంధించిన నివేదికలను తెప్పించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో 6వేల మంది కానిస్టేబుళ్లు, 500 మంది ఎస్సైల నియామకం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రిక్రూట్మెంట్ బోర్డు ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. అలాగే హోంగార్డుల నియామకానికి సంబంధించి కూడా ప్రభుత్వం త్వరలోనే ఓ ...
Read More »