గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకల నిర్వహణ కోసం ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్శర్మ, సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి అజయ్మిశ్రా, డీజీపీ అనురాగ్శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి, ప్రొటోకాల్ డిప్యూటీ కమిషనర్ హర్మిందర్సింగ్ మంగళవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. తారామతి మసీదు వద్ద వేదిక ఏర్పాటు, దాని పక్కనే జాతీయ జెండా ఆవిష్కరణ, ముఖ్యమంత్రి ప్రసంగ వేదిక ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.
పోలీసులు పరేడ్ రిహార్సల్స్ను నిర్వహించారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా గోల్కొండ ప్రాంతంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి తెలిపారు. వేడుకల రోజు పాసులు ఉన్నవారినే అనుమతిస్తామని తెలిపారు. భద్రతపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహనాలను కోటలోకి అనుమతింబోమన్నారు. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రూట్ మ్యాప్ను రూపొందించినట్లు ఆయన మీడియాకు తెలిపారు. కాగా, గోల్కొండ కోటలో ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వచ్చిన రాష్ట్ర డీజీపీ అనురాగ్శర్మ వాహనానికి రాందేవ్గూడ నుంచి గోల్కొండ వరకు పోలీసులు బైక్పై పైలెటింగ్ నిర్వహించారు. గోల్కొండ పోలీస్స్టేషన్కు చెందిన రక్షక్ వాహనం మొరాయించడంతో స్థానిక ఎస్ఐ బైక్పై పైలెటింగ్ నిర్వహించారు.
[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో